ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

కార్పొరేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యుల సేవలు

On
ఐదు కేజీల కణితిని తొలగించిన ప్రభుత్వ వైద్యులు 

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్)జనవరి16: భద్రాద్రి కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంకి  చెందిన కృష్ణవేణి 35 సంవత్సరాలు అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కడుపులో నొప్పితో బాధపడుతూ, నొప్పి వచ్చినప్పుడల్లా  అందుబాటులోఉన్న ఆర్ఎంపి వైద్యుల వద్ద చూయించుకొని, మందులు వాడుతూ ఉంటుంది. గత నాలుగు రోజుల క్రితం నొప్పి భరించలేక కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలొని వైద్యుల వద్దకు రాగా , వారు వైద్య పరీక్షలు నిర్వహించగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా కడుపులో కణితి ఉన్నదాని వైద్యులు గుర్తించారు. ఆ కణితి ఐదు కేజీల బరువు ఉండగా వైద్యులకు ఆపరేషన్ అతికిష్టమైన కూడా గురువారం  సర్వజన ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శాస్త్ర చికిత్సలో డాక్టర్ నవదీప్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జరీ, డాక్టర్ ప్రవీణ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా, నర్సింగ్ ఆఫీసర్స్ వేద, రత్న, ఓటి సిబ్బంది హేమ, ఆది, కోటి ,అనిల్ పాల్గొన్నారు.

Views: 343
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి