బెంగాల్ పాలిటిక్స్

On

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత సయోధ్య నెలకొంటోందని తెలుస్తోంది. తీవ్ర విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ బెంగాల్ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి (Suvendu Adhikari) తో కాసేపు సమావేశమయ్యారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుబేందు తన తమ్ముడు లాంటి వాడని సంభోదించారు. టీ తాగేందుకు రావాలని […]

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత సయోధ్య నెలకొంటోందని తెలుస్తోంది.

తీవ్ర విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ బెంగాల్ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి (Suvendu Adhikari) తో కాసేపు సమావేశమయ్యారు.

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుబేందు తన తమ్ముడు లాంటి వాడని సంభోదించారు. టీ తాగేందుకు రావాలని కూడా పిలిచారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీదీ తనను టీ తాగేందుకు పిలిచారని, అయితే తాను టీ తాగలేదని సుబేందు చెప్పారు. కేవలం మర్యాద పూర్వక భేటీ తప్ప మరేమీ లేదని తేల్చి చెప్పారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News