మార్పు మొదలైంది.. పాయకరావుపేటలో ఎవరంటే..?
పెదపాటి అమ్మాజీకే గెలిచే ఛాన్స్

పాయకరావుపేటలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గొల్ల బాబూరావుపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఒక వేళ అభ్యర్ధిని మార్చి.. మహిళా అభ్యర్ధిని బరిలోకి దింపితే.. విజయావకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ హైకమాండ్.. టీడీపీ మహిళా అభ్యర్ధికి దీటుగా ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని పోటీలో దింపాలని చూస్తోంది. అమ్మాజీకి ఉన్న స్థానిక మద్దతు నేపథ్యంలో పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని.. అన్ని వర్గాలను అమ్మాజీ కలుపుకుని వెళ్తారని అది పార్టీకి మంచి మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List