ఒకే టిక్కెట్తో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ దర్శనం.. భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
11 రోజుల ఆధ్యాత్మిక యాత్రలో 5 జ్యోతిర్లింగాలు, ద్వారక, నాగేశ్వర్, సోమనాథ్, ఎల్లోరా గుహల సందర్శన
IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర. ఒకే ప్యాకేజీలో 5 జ్యోతిర్లింగాలు, ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్, సోమనాథ్, ఎల్లోరా గుహల దర్శనం.

శివభక్తులకు IRCTC ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా 11 రోజులపాటు కొనసాగే ఈ యాత్రలో ఐదు జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర్ మహాదేవ్, సోమనాథ్, ఎల్లోరా గుహలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.
జూలై 11న ప్రారంభమయ్యే ఈ యాత్ర జూలై 21 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక టూర్లో గుజరాత్లోని ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనాలు ఉంటాయి.
మహారాష్ట్రలోని భీమాశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను కూడా భక్తులు సందర్శించవచ్చు. అదనంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఎల్లోరా గుహల సందర్శన కూడా టూర్లో భాగంగా ఉంటుంది.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, స్థానిక రవాణా, టూర్ ఎస్కార్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కల్పించబడుతున్నాయి.
స్లీపర్ క్లాస్ ప్యాకేజీ ధర ₹20,250 కాగా, 3AC ప్యాకేజీ ₹33,250, 2AC ప్యాకేజీ ₹44,000గా నిర్ణయించారు.
భక్తులు విడివిడిగా ఈ ప్రాంతాలను సందర్శిస్తే అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ ప్యాకేజీ ఎంతో ప్రయోజనకరమని టూర్ నిర్వాహకులు చెబుతున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List