భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..
ఎఫ్సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి..
రంగారెడ్డి, జూన్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, రాబోయే తరాల కోసం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అత్యాధునిక నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధికి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) నూతన కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధి చరిత్ర దూరదృష్టి నిర్ణయాలకు నిదర్శనమన్నారు. గతంలో చేపట్టిన , , , వంటి ప్రాజెక్టులే నేటి హైదరాబాద్కు బలమైన ఆర్థిక పునాదులుగా నిలిచాయని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీ, వరదలు, పట్టణ విస్తరణ వంటి సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు అందించేలా అత్యాధునిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం, జలవనరుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. “లేక్ ఎకానమీ” భావనతో చెరువులను అభివృద్ధి చేసి స్థానిక మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాలుష్యరహిత, సుస్థిర అభివృద్ధి నమూనాగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దనున్నామని, గ్రీన్ ఫార్మా, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ఐటీ సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాలను కూడా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగం చేసి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్, మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేమ నరేందర్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్ తదితర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comment List