ఘర్షణ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ 

On
ఘర్షణ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ 

 కొత్తగూడెం( న్యూస్ ఇండియా ప్రతినిధి)జూలై 21 :కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా ఇరువర్గాల వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు చట్టపరమైన చర్యల్లో భాగంగా ఇరువర్గాల వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వ్యక్తిగత లేదా వర్గాల మధ్య తలెత్తే వివాదాలను చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, గొడవలు, దాడులు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఎలాంటి చర్యలనైనా పోలీసులు కఠినంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.ప్రజలందరూ పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తూ, చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించాలని కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు కోరారు.

Views: 70
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత? పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత?
ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో జరిగే నవకళేబర మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకు మారుస్తారని చెప్పే...
ఘర్షణ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ 
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత 
ఏపీలో తప్పక దర్శించాల్సిన టాప్ 10 అద్భుత దేవాలయాలు.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర క్షేత్రాలు!
భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయాలు ఇవే.. తిరుమల, షిర్డీ, వైష్ణోదేవికి ఏటా ఎంత ఆదాయం వస్తుంది?
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్?.. S-500 టెక్నాలజీపై కీలక ప్రతిపాదన.. చైనా, పాకిస్తాన్‌కు టెన్షనా?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి ఈ 10 ఆహార అలవాట్లే కారణమా? నిపుణులు ఏమంటున్నారు?