యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

On
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, జూలై 19, న్యూస్ ఇండియా ప్రతినిధి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మంజుల అనే మహిళకు నీలాద్రి ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేశారు. అయితే ఆమెకు కొన్ని యాంటీబయాటిక్‌ మందులు పడవని ముందుగానే వైద్యులకు తెలిపినా పట్టించుకోలేదని కుటుంబీకులు ఆరోపించారు. ఆపరేషన్‌ అనంతరం మంజుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మంజుల మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు! లోన్ పూర్తిగా చెల్లించారా? ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే తర్వాత పెద్ద సమస్యలు రావచ్చు!
లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత బ్యాంక్ నుంచి NOC, ఒరిజినల్ డాక్యుమెంట్లు, లోన్ క్లోజర్ లెటర్ వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఆస్తి...
మనీ ప్లాంట్ వాస్తు రహస్యం ఇదే.. ఈ దిక్కులో ఉంచితే శుభమని ఎందుకు చెబుతారు?
జస్ట్ రెండున్నర గంటలే.. హైదరాబాద్‌-విజయవాడ మధ్య 12 లైన్‌ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే.. గేమ్ ఛేంజర్ కానుందా?
#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం