తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఐజేయు సంఘం కోశాధికారి బిజ్జాల వెంకటరమణ
మహబూబాబాద్ జిల్లా::-
తొర్రూరు డివిజన్ కేంద్రం::-

తొర్రూరు డివిజన్ కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జర్నలిస్టుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఐజేయు సంఘం కోశాధికారి బిజ్జాల వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన జర్నలిస్టు సంఘం ఐజేయు కాగా, రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వాలతో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంఘం కొనసాగుతోందని పేర్కొన్నారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సంఘం సభ్యత్వాన్ని స్వీకరించారు.

Comment List