ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తోరూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గం:-
పాలకుర్తి నియోజకవర్గంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, వారానికి మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు రాగిజావతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, జీవన నైపుణ్యాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.పా
నేటి పరిస్థితుల్లో అధిక ఫీజులు చెల్లించినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందనే హామీ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మాత్రం విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్వీకరిస్తున్న ప్రజలు, అదే ప్రభుత్వం అందిస్తున్న ఉచిత, నాణ్యమైన విద్యను కూడా విశ్వసించాలని కోరారు. దేశంలోని ఎందరో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయమూర్తులు, పరిపాలనాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తుచేశారు.
"విజయానికి పాఠశాల పేరు కాదు... విద్యార్థి కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే పునాది. కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని" అనుమాండ్ల తిరుపతి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Comment List