పరిశుభ్రత ఫుడ్ సేఫ్టీ గైడెన్స్ పాటించడం లేదు
సింహాద్రి హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన
పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు
సింహాచలం: సింహాచలం దేవస్థానం పరిధిలో నడుస్తున్న సింహాద్రి హోటల్ ఫుడ్ సేఫ్టీ గైడెన్స్ పరిశుభ్రత పాటించడం లేదని భక్తుల ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని 26:04:2024 తేదీన తను సింహాచలం దేవస్థానానికి వెళ్లి క్రింద ఉన్న సింహాద్రి హోటల్కు టిఫిన్ చేయడానికి నేను మా అన్నయ్య ఆడారి రాము వచ్చామని 2 ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చామని అయితే జంగు పట్టిన ప్లేట్లో బట్టల సబ్బు చిన్న ముక్కలు ఉన్నాయి ప్లేట్ పై కవర్ ఎందుకు వేయలేదు అని అడిగినందుకు నాపై మా అన్నయ్య పై కుర్చీలు ఇనుపరాట్లతో దాడి చేశారని పనికి ఆరుకుట్లు కూడా కేజీహెచ్ హాస్పిటల్ పడ్డాయని సింహాద్రి ఓట్లపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు అయిందని దేవస్థానం ఈవో కూడా ఫిర్యాదు చేశామని తెలియజేశారు.
సింహాద్రి హోటల్ పై పూర్తిగా తనిఖీలు చేయాలని పరిశుభ్రత ఫుడ్ సేఫ్టీ గైడెన్స్ పాటించలేనందున సింహాద్రి హోటల్ పై కఠిన చర్యలు సింహాచల దేవస్థానం భక్తులకు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు ఫుడ్ సేఫ్టీ అధికారి ఎస్ ఆనంద్ రావుకి ఫిర్యాదు కాపీ ఎఫ్ ఐ ఆర్ కాఫీ దెబ్బ తగిలిన ఫొటోస్ మెడికల్ రిపోర్టులు అన్ని సమర్పించడం జరిగింది అదేవిధంగా త్వరలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా కలిసి పిర్యాదు చేస్తానని ఆడరి నాగరాజు చెప్పారు.
Comment List