ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందాం... మన పిల్లల భవిష్యత్ ను కాపాడుకుందాం...!

- కర్నూల్ లో 22వ తేదీన జరిగే సమావేశానికి వాల్మీకి సోదరులు హాజరు కావలెను.

On
ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందాం... మన పిల్లల భవిష్యత్ ను కాపాడుకుందాం...!

- వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు అర్జున్ - పిలుపు.

న్యూస్ ఇండియా ప్రతినిధి/పెద్దకడబూరు మండలం సెప్టెంబర్ 15 :- ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ (ఏపీవిబిఎస్) సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ హాల్లో సెప్టెంబర్ 22వ తేదీన అదివారం సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అర్జున్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ వాల్మీకి /బోయలు ఎస్టీ లో చేర్పించే విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వాల్మీకులకు న్యాయం చేయాలని కోరుతూ కర్నూలు జడ్పి హాల్లో రాష్ట్ర స్థాయి చర్చా(వర్క్ షాప్) సమావేశ కార్యాక్రమంను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో వాల్మీకి సీనియర్ నాయకులు, వాల్మీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వాల్మీకి సంఘాల నాయకులు రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొననున్నారని, ఆలాగే పెద్దకడబూరు మండలం నుంచి కూడా వాల్మీకి సోదరులు భారీ ఎత్తున పాల్గొని వాల్మీకి/బోయ జాతిని ఎస్టీ రిజర్వేషన్ లో చేర్చేంత వరకు తమ వంతుగా కృషి చేస్తూ సలహా సూచనాలను ఇవ్వాలని ఆదివారం పెద్దకడుబూరులోని వాల్మీకి మహర్షి విగ్రహం నందు పాల్గొన్న వాల్మీకి బోయ జిల్లా అధ్యక్షులు అర్జున్ గ్రామంలోని వాల్మీకి సోదరులను కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల అధ్యక్షులు రామాంజిని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పోరాడి ఎస్టీ రిజర్వేషన్ ను సాధించుకుందామని, భవిష్యత్ లో మన పిల్లలు విద్యా రంగంలో రానించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు మనమందరం ఏకమై ప్రత్యేక రిజర్వేషన్ సాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మొట్రూ ఈరన్న, తలారీ అంజి, మబ్బు ఆంజినయ్య, కల్లుకుంట వీరేష్, జింక లక్ష్మన్న, దుర్గయ్య, తిక్కన్న, వెంకటేష్, లక్ష్మన్న, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.IMG_20240915_210714

Views: 159
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు.. 
శ్రీ ఇందు కళాశాల బస్సుల్లో భద్రతా లోపాలు..  తనిఖీల్లో వెలుగులోకి పలు నిబంధనల ఉల్లంఘనలు.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూన్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తనిఖీలలో...
లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!