‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐల సంపూర్ణ మద్దత్తు
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మెయిన్ రోడ్, ఐటిఐ ప్రక్కన వున్నా 'రేణుక మాత వైన్స్' లో గత వారం రోజుల క్రితం నుండి పట్టపగలు 6.45 నిముషాలకు యథేచ్ఛగా మద్యం అమ్మకాలు ప్రారంభించబడి, యథావిధిగా కొనసాగుతున్నవి. ఈ సమయ పాలనా ఉల్లంఘన పట్ల సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ నిర్వాకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్సైజ్ శాఖ, సంగారెడ్డి జిల్లా కార్యాలయం కూత వేటు దూరంలోనే ఉన్నా... ఈ అక్రమ అమ్మకాలకు కట్టడి చెయ్యలేని దుస్థితిలో ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐ లు వున్నారు. సమయపాలన ఉల్లంఘించి జరుగుతున్నా ఈ అమ్మకాల పట్ల సంగారెడ్డి పట్టణ ఎక్సైజ్ శాఖ ఎస్ఐ, సిఐ లకు సాక్షాదారాలతో పాటు పూర్తి సమాచారం ఉన్నపటికీ వారి వ్యవహారం మాత్రము ‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ అనే విదంగా కొనసాగుతున్నట్టు స్పష్టమౌతుంది. మద్యం ప్రియులకు మద్యం మత్తు, సంబంధిత అధికారులకు ‘లంచాలు మత్తు’ కాబట్టే ఈ విదంగా పట్టపగలు అమ్మకాలు జరుగుతున్నవి అంటూ మద్యం ప్రియులు అధికారుల పట్ల బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయం వారి పై అధికారుల ద్రుష్టి కి వెళ్లి సమయపాలన లేకుండా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుందో, లేదో.. చూడాలి?
Comment List