ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...

On
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు  రెండు వందల యాభై కిలో మీటర్లు పాదయాత్ర కోసం  సిద్ధమయ్యారు.ఈ నెల "17 వ తారీకు నుంచి పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ తో చేసే *పాదయాత్ర "లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు మాజీ ఐ.ఏ.ఇస్ ఆఫీసర్  చిరంజీవులు  చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ ఆ పైస్థాయి ప్రైవేటు కాలేజీలు అన్ని మూతపడి.ఆ కాలేజీల యాజమాన్యాలు సమ్మెబాట పట్టి చాలా రోజులైంది ఆ యాజమాన్యాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తొమ్మిది వందల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయమనీ అడుగుతున్నారు.ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలంటున్నారు, ఇంకా రావలసిన బకాయలు గురించి ఆ తర్వాత ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తు, వారి పరీక్షలు ఇవేవీ వాళ్లకు పట్టడం లేదు ఈ దేశాన్ని నిర్మించే  అటువంటి విజ్ఞానాన్ని నేర్పేటువంటి విద్యాసంస్థలు,  అక్కడ నేర్చుకునే విద్యార్థులు గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కించిత్ కూడా ఇంట్రెస్ట్, అవసరం లేదు అనుకుంట కేవలం తమ స్వార్థం కోసం తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే తమకు అవసరమైన వాటిని మాత్రమే పట్టించుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ దాదాపు 40 శాతం ఉన్నటువంటి యువత ఇలాంటి వాటి గురించి తప్పకుండా ఆలోచించాలి అని  , చాలా మంది పేద విద్యార్థులు సర్టిఫికేట్ కోసం మొత్తం ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ లు ఇస్తున్నారు అని  చెప్తున్నారు.నా పాదయాత్ర చూసి అయిన ప్రభుత్వం నికి సిగ్గు రావాలి అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,  బీసీ.ఐ.ఎఫ్.చైర్మన్ మాజీ ఐ.ఏ.ఎస్.చిరంజీవులు ,మాజీ డీజీపీ ఐ.పి.ఎస్ డా.పూర్ణ చందర్ రావు ,ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ , మినరల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఇరవర్తి , బీసీ కళాకారులు రామలింగం , డప్పు స్వామి, ఉస్మానియా పి.ఎచ్.డి.ఆవారా వేణు , హెచ్.సి.యు తెలుగు ప్రొఫెసర్  పిల్లలమర్రి రాములు , బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజు గౌడ్ , దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు ఆయిల వెంకన్న గౌడ్ , మహిళా అధ్యక్షులు వసుమతి వరకల, పద్మశాలి వెంకన్న నేత, జి.మురళి యాదవ్ , జ్ఞానేశ్వర్ రాపోలు దయాకర్, బీసీ యువ నాయకులు బైరీ శేఖర్ , కె.వెంకటయ్య గౌడ్ , పిడికిలి రాజు ,శివ యాదవ్, లక్ష్మణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా? లగ్జరీ కారవాన్‌లో ఫ్రెండ్స్‌తో 3 రోజుల గోవా ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?
హైదరాబాద్ నుంచి గోవాకు లగ్జరీ కారవాన్‌లో 3 రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కారవాన్‌లో ఉండే సౌకర్యాలు, మొత్తం ఖర్చు, 10–12 మంది వెళ్తే ఒక్కో వ్యక్తికి...
ఈ 4 ఆస్తులు మిమ్మల్ని పేదవాళ్లని చేస్తాయ్..! ధనవంతులు మాత్రం ఈ తప్పు చేయరు
సూపర్ ఎల్‌నినో వెనుక గోల్డ్ సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని మార్చే ప్రకృతి లాటరీ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం తవ్వకాలు ప్రారంభం.. జొన్నగిరి గోల్డ్ మైన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతుందా?
ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. కరువు, ఆహార సంక్షోభం తప్పదా?
తెలివిగా ధనవంతులు కావడం ఎలా? సంపద సృష్టించే 10 గోల్డెన్ రూల్స్ ఇవే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా.. రైల్వే రూల్స్ తెలుసా?