
కేసీఆర్ ఖబడ్దార్..!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్.. తెలంగాణ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన ఆయన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యావసనాలు ఎదుర్కొక తప్పదని.. తెలంగాణలో పరిపాలకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారన్నారు. తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి..ఆ తల్లి రొమ్ము గుద్దారని విమర్శించారు. ఆవు పాలు పిండుకోవాలే కానీ ఆవును చంపేసే ప్రయత్నం చేస్తున్నారని మండి […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎల్ సంతోష్.. తెలంగాణ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశానికి వచ్చిన ఆయన పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తనపై ఆరోపణలు చేసిన వాళ్లు పర్యావసనాలు ఎదుర్కొక తప్పదని.. తెలంగాణలో పరిపాలకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారన్నారు.
తెలంగాణ తల్లి పేరు మీద గెలిచి..ఆ తల్లి రొమ్ము గుద్దారని విమర్శించారు. ఆవు పాలు పిండుకోవాలే కానీ ఆవును చంపేసే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.
తానెవరో తెలియదని.. కానీ ఇప్పుడు తన పేరు తెలంగాణలో ఇంటింటికీ వెళ్లిందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన సమాధానం చెపుతామన్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List