రాజకీయాల్లో కృష్ణ స్టైల్లే వేరు

On

రాజకీయాల్లోనూ సూపర్‌ స్టార్‌ కృష్ణ తనదైన ముద్ర వేశారు. రామారావు, కృష్ణ మధ్య రాజకీయ విభేదాలొచ్చాయి.. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి. ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు.. […]

రాజకీయాల్లోనూ సూపర్‌ స్టార్‌ కృష్ణ తనదైన ముద్ర వేశారు. రామారావు, కృష్ణ మధ్య రాజకీయ విభేదాలొచ్చాయి..

1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ళ భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కరరావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది.

ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి. ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు..

ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కలిశారు.. ఇదే సమయంలో.. రామారావు మాస్‌ అప్పీల్‌ తెలుగుదేశం పార్టీకి ప్లస్‌ అవుతోంది..

Read More అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?

అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆయన్ను పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత తెలుగునాట..ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు..ఆ క్రమంలో వచ్చినవే మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి ఇంకా ఇతర సినిమాలు.. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక ఉన్నదీ ఇదే కారణం.

1989లో కృష్ణ కాంగ్రెస్ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు.

1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది.. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓడిపోయారు. ..2009లో ఎన్నికల్లో వైఎస్‌ కోరిక మేరకు కృష్ణ కుటుంబం కాంగ్రెస్‌కు నైతిక మద్దతు తెలిపింది.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..