కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

చెర్లపాలెం గ్రామానికి మరో శుభవార్త

గత కొద్ది రోజుల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎల్లమ్మ గుడికి విరాళం

ప్రస్తుతం చర్లపాలెంలో ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణం

 అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలుIMG-20250813-WA0034

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలోని ముత్యాలమ్మ గుడి పునర్నిర్మాణానికి అనుమండ్ల మాధవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. గత కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని కొత్తగా నిర్మించేందుకు అవసరమైన మొత్తాన్ని ట్రస్ట్ భరిస్తుందని తోరూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమండ్ల తిరుపతిరెడ్డి తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామాన్ని సందర్శించిన ఆయన, ముత్యాలమ్మ గుడి నిర్మాణం త్వరలో ప్రారంబించి గ్రామస్తుల ఆశయాన్ని నెరవేర్చడమే మా లక్ష్యం అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ...ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, గ్రామ ప్రజల ఏకతతో ఈ పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది బోనాల పండుగకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేసి, కొత్త గుడికి భక్తులు దర్శనానికి సిద్ధం కావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి అన్నారు.ఈ వార్త తెలిసిన వెంటనే పెద్దలు, మహిళలు, యువతీ,యువకులు తిరుపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బోనాల సందర్భంగా తల్లిని దర్శించుకున్న భక్తులు మాట్లాడుతూ...మా బాల్యం నుండి ఉన్న కల ఇప్పుడు నెరవేరబోతోంది. మా తరాలవారు కొత్త గుడిలో తల్లిని దర్శించుకునే రోజు దగ్గరలోనే ఉంది అని తెలిపారు.ముత్యాలమ్మ గుడి కేవలం ఆరాధన స్థలం మాత్రమే కాదు, గ్రామ ఏకతకు ప్రతీక,పునర్నిర్మాణం పూర్తయిన  రోజు చెర్లపాలెం చరిత్రలో బంగారు అక్షరాల్లో నిలిచిపోనుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Read More యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు

Views: 49
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

#విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం #విద్యార్థుల్లో నాయకత్వ స్ఫూర్తి పెంపే లక్ష్యం
శేరిలింగంపల్లి, మదీనాగూడ: గౌతమ్ మోడల్ స్కూల్‌లో శుక్రవారం ది.17-07-2026 నిర్వహించిన ఇన్వెస్టిచర్ సెరిమనీలో విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేస్తున్న ముఖ్య అతిథి జి. హనుమంతరావు, అదనపు డిప్యూటీ...
యుఎస్-ఇరాన్ యుద్ధంతో ఆర్థిక మాంద్యం ముప్పు... బంగారాన్ని భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఇరాన్ యుద్ధం చైనాకు లాభం ఎందుకో తెలుసా? పశ్చిమాసియా యుద్ధం వెనుక దాగిన అసలు వ్యూహం
సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం
యాంటీబయాటిక్‌ పడదని చెప్పినా నిర్లక్ష్యం: కుటుంబీకులు
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..