పాయకరావుపేట వైసీపీలో రోడ్డెక్కిన విభేదాలు

లోకల్ పెదపాటి అమ్మాజీకి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్

On
పాయకరావుపేట వైసీపీలో రోడ్డెక్కిన విభేదాలు

పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలో విభేదాలు రోడ్డెక్కాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్థానంలో ఇన్ ఛార్జిగా విజయనగరం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు.WhatsApp Image 2024-02-13 at 10.24.24 AM 

ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే కేటాయించాలని లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దం అంటూ ర్యాలీ చేపట్టారు. వచ్చిన వారంతా జై జగన్.. జై అమ్మాజీనాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జాతీయ రహదారి కూడలి నుంచి ర్యాలీగా వచ్చి, పాత జాతీయ రహదారి కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. వీరి ఆందోళనతో రహదారిపై ఇరువైపులా పెత్త ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. బయటి నుంచి వచ్చిన వారు ఎమ్మెల్యేగా ఎన్నికై స్థానికులను పట్టించుకోవడం లేదన్నారు.  ఇక్కడి పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా అడగడం లేదన్నారు. వారికి ముడుపులు అందుతాయని ఆరోపించారు. 

Views: 134
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్