కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

On
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి

*👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్*
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద రోజుకు 400 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పిల్లల చదువుల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళే వారికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు కార్మిక న్యాయం కింద ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యవసర రోగ నిర్ధారణ పరీక్షలు మందులు మరియు ఆపరేషన్లతో కూడిన ఆరోగ్య రక్షణ కల్పించబడునని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు న్యాయాలను తప్పక అమలు చేయడం జరుగుతుందని అన్నారు సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం యువ న్యాయం, మహిళా న్యాయం, ఇలా అన్ని రకాల ప్రజలకు మేలు చేకూర్చే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన వెంటనే 8500 జీతంతో ఒక సంవత్సరం ట్రైనింగ్ అల్లోవెన్స్ ప్రతి పేద ఇంటి ఇంటి పెద్ద మహిళా అకౌంట్ లో సంవత్సరం 1,00,000 వేయనున్నట్లు తెలిపారు రైతులకు msp చట్టం చేయుట దగ్గర్నించి గ్యారెంటీ లు అమలు చేస్తామని బ్యాలెట్ బాక్స్ మీద మూడో నెంబర్ ఎదురుగా ఉన్న హస్తం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పాపులు, సీనియర్ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్స్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల్ నాగేశ్వర్ రావు, BH రబ్బానీ,  గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 10
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం