చెడుపై సాధించిన విజయమే విజయదశమి

రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

On
చెడుపై సాధించిన విజయమే విజయదశమి

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామంలో విజయదశమి సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలోని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనాదిగా వస్తున్నచెడుపై మంచి సాధించిన విజయమే విజయ దశమి దినముగా అనాదికాలం నుండి భాగింపబడుతున్నదని శాస్త్రికులు పేర్కొన్నారు. దీని యొక్క సారాంశం ఏమనగా లోక కళ్యాణం కొరకు ఆనాడు శ్రీరాముడు రావనుడి పై యుద్ధం చేసి విజయం సాధించిన దానికి సంకేతం గానే ప్రజలందరూ విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అదేరోజు పాండవులు జమ్మి చెట్టు మీద ఉంచిన ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఇంతటి చరిత్ర కలిగిన విజయదశమిని ప్రజలందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని గ్రామ సర్పంచ్  జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Views: 158

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News