టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..

On
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..

అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..

IMG-20260523-WA0942
మల్ వద్ద సాగర్ హైవేపై అధికలోడుతో ఒరిగిన టిప్పర్..

రంగారెడ్డి జిల్లా, యాచారం, మే 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామం వద్ద నాగార్జునసాగర్ హైవేపై శనివారం ఓ టిప్పర్ ఒరిగి రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పింది. చెరువు మట్టితో అధిక లోడుతో ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న టిప్పర్ (టిఎస్07యుఈ5346) అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై ఒరిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న యాచారం పెట్రోలింగ్ మొబైల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో టిప్పర్ స్వల్పంగా దెబ్బతినగా, హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అధిక లోడుతో వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

Views: 50

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ...
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?