వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు యువకుల దుర్మరణం

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు యువకుల దుర్మరణంIMG_20260520_100806

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలి కట్ట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ విషాద ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్ (25), లింగమల్ల సతీశ్ (28), పొట్టకర్ల వంశీ (22) ద్విచక్ర వాహనంపై వరంగల్ వైపు వెళ్తు న్నారు. ఈ క్రమంలో వెలికట్ట శివారులోని పాలకేంద్రం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న ధాన్యం లోడ్ ట్రాక్టర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అల్లి సంపత్, లింగమల్ల సతీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పొట్టకర్ల వంశీని 108లో వర్ధన్నపేటకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడు అల్లి సంపత్ కొద్దిరోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. లింగమల్ల సతీశ్ భార్య మూడు సంవత్సరాల క్రితమే మృతి చెందగా, అతడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ముగ్గురు యువకులు మృతి చెంద డంతో బొడ్లాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న తొర్రూరు సీఐ గణేశ్, ఎస్సై మహేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 55
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకుల దుర్మరణం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలి కట్ట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు...
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం
“గోల్డ్ తగ్గించండి”.. మోదీ విజ్ఞప్తి వెనుక దేశాన్ని కుదిపే ఎకనామిక్ టెన్షన్!