పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
15 రోజుల పాటు ఓపి ఉచితం,అన్ని రక్త పరీక్షలపై 50% డిస్కౌంట్-మేనేజర్ మణికంఠ
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో కార్పోరేట్ కు దీటుగా నేరుగా ప్రజలే స్పందించే విధంగా మధ్యవర్తులు,ఆర్ఎంపీలు లేకుండా అరుదైన వైద్యం అందిస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పేద ప్రజలు సహాయం అని వస్తే వెంటనే స్పందించే వ్యక్తి శ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ గుర్రం సత్యనారాయణ.అదే వ్యక్తిత్వంతో శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను స్థాపించి స్పెషలిస్టు డాక్టర్లను,పిల్లల వైద్య నిపుణుల సారథ్యంలో అరుదైన వైద్యం అందిస్తున్నామని అన్నారు.పేద ప్రజలు నేరుగా సంప్రదించే సౌలభ్యం కల్పిస్తున్నామని ఎమర్జెన్సీ కేసులు సకాలంలో స్పందించి చూడబడతాయని అన్నారు.పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని అన్నారు. హాస్పటల్లో 15 రోజుల పాటు ఉచితంగా ఓపి చూడబడును అని,అన్ని రక్త పరీక్షలపై 50% డిస్కౌంట్ ఇవ్వబడుతుందని హాస్పిటల్ మేనేజర్ మణికంఠ తెలిపారు.ప్రజలకు అణువుగా వైరా రోడ్డు, పాత బస్టాండ్ కి దగ్గరగా,ఆర్ సిఎం చర్చ్ ఎదురుగా హాస్పటల్ ఉంటుందని తెలియజేశారు.


Comment List