డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

నాలుగో రోజు ఎలక్ట్రిసిటీ జట్టు విజయం

On
డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జి కృష్ణ

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 11: డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగో రోజు కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సోమవారం మీడియా -1 జట్టు మరియు ఎలక్ట్రిసిటీ జట్టు మధ్య పోటీ నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన మీడియా-1 జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 165/7 పరుగులు చేసి,166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఎలక్ట్రిసిటీ జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రిసిటీ జట్టు 19 ఓవర్లలో 166/5పరుగులు సాధించి విజయ బావుటా ఎగురవేసింది.మీడియా-1 జట్టు నుంచి సంసాన్ (39), రాజేష్ (38) ఇమ్రాన్ షేక్ (28) అత్యధిక పరుగులు చేశారు. ఎలక్ట్రిసిటీ జట్టు నుంచి జి.కృష్ణ (69),కృష్ణారావు(42)అత్యధిక పరుగులు అందించి జట్టు విజయానికి కృషి చేశారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జి.కృష్ణకు ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, జాన్సన్ డేవిడ్(బాబు),ఆర్గనైజర్ మడికంటి నవీన్,పెద్దపల్లి కిరణ్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.ఎంపైర్లుగా పి.భార్గవ్,కిరణ్ వ్యవహరించారు.IMG20241111170541

Views: 246
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు