చికెన్ బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను అని రెస్టారెంట్ యజమాని...

On
చికెన్ బిర్యానిలో బల్లి..

బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను... రెస్టారెంట్ యజమాని..

IMG-20250515-WA0635
బిర్యానీలో బల్లి..

ఇబ్రహీంపట్నం, మే 15, న్యూస్ ఇండియా ప్రతినిధి: రెస్టారెంట్ లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు/ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్డు లో ఉన్న మై పిల్ ప్యామిలీ రెస్టారెంట్ లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీ ని తినడం మొదలుపెట్టారు. బిర్యానీ లో బల్లి కనిపించడం తో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తర్వాత తేరుకొని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..