చికెన్ బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను అని రెస్టారెంట్ యజమాని...

On
చికెన్ బిర్యానిలో బల్లి..

బిర్యానిలో బల్లి..

మంచిగా ఫ్రై అయింది తిను... రెస్టారెంట్ యజమాని..

IMG-20250515-WA0635
బిర్యానీలో బల్లి..

ఇబ్రహీంపట్నం, మే 15, న్యూస్ ఇండియా ప్రతినిధి: రెస్టారెంట్ లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు/ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్డు లో ఉన్న మై పిల్ ప్యామిలీ రెస్టారెంట్ లో ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణ రెడ్డి గురువారం మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీ ని తినడం మొదలుపెట్టారు. బిర్యానీ లో బల్లి కనిపించడం తో ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. తర్వాత తేరుకొని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయింది తిను అని చెప్పడంతో కంగుతిన్నాడు. దీంతో బాధితుడు పోలీసులకు 100 డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెస్టారెంట్ మేనేజర్ ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి. రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల వేగవంతం చేయాలి.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 15, న్యూస్ ఇండియా : రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (అర్.అర్.అర్) విస్తరణ పనుల ప్రగతిని...
టెక్నికల్ సిబ్బందికి వివిధ వర్టికల్ విభాలపై నైపుణ్యత గురించి ఒక్కరోజు శిక్షణ తరగతులు.
చికెన్ బిర్యానిలో బల్లి..
మాచన" కు రాష్ట్రపతి అభినందన..
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ జే ఎన్నికలు ఏకగ్రీవం
ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..