ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు ఆధ్వర్యంలో
ఒక్కరి నేత్రదానం ఇద్దరికీ కంటిచూపు అనీ ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు శనివారం మరో సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోనీ శ్రీ రామ ప్రింటర్స్ వేమిశెట్టి రాము తల్లి,వేమిశెట్టి భాగ్యలక్ష్మి స్వర్గస్తులైన సందర్భంగా వారి నేత్రాలను దానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రామ నరసయ్య మాట్లాడుతూ...నేత్రదానం ద్వారా ఇద్దరికీ చూపుని ప్రసాదించే అవకాశం లభిస్తుందని, కార్నియల్ సమస్యలతో బాధపడుతున్న వారికి తిరిగి వెలుగుని అందించవచ్చని వివరించారు.భాగ్యలక్ష్మి కుమారుడు రాము తన తల్లి నేత్రాలను దానం చేయడానికి అంగీకరించగా లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ నేత్రాలను సేకరించి ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ కి పంపించారు. ఇక అనంతరం వారు మాట్లాడుతూ...భాగ్యలక్ష్మి దహన సంస్కార ఖర్చుల నిమిత్తం రూ.10,000/- ను లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు తరఫున క్లబ్ అధ్యక్షుడు డా. రామ నరసయ్య భరించనున్నట్టు రాము కుటుంబానికి తెలిపారు.భాగ్యలక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని లయన్స్ క్లబ్ తరఫున ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చిదురాల నవీన్, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, సభ్యులు మచ్చ సురేష్, చిదురాల శ్రీనివాస్, ఇమ్మడి రాంబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.
Comment List