డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..

ఎన్ఐటి మిజోరం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న విద్యావేత్తకు అరుదైన గుర్తింపు..

On
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..

డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..

ఎన్ఐటి మిజోరం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న విద్యావేత్తకు అరుదైన గుర్తింపు..

IMG-20251126-WA1539
డాక్టరేట్ అందుకుంటున్న వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాదారం విక్రమ్ గౌడ్..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, నవంబర్ 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వాసవి రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాదారం విక్రమ్ గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) మిజోరం ఆయనకు గౌరవ డాక్టరేట్ (Ph.D)‌ను ప్రదానం చేసింది.

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో యంత్రాల ఉత్పత్తి, వినియోగం, పనితీరుల మెరుగుదలకు సంబంధించిన పలు ప్రయోగాలు, పరిశోధనలు నిర్వహించినందుకు గుర్తింపుగా విక్రమ్ గౌడ్‌కు ఈ డాక్టరేట్ లభించింది.

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

“ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జ్ షెడ్యూలింగ్ స్టార్ట్ ఆప్టిమైజేషన్” అంశంపై ఆయన రచించిన థీసిస్‌ను డా. ప్రబిత్ర కుమార్ విశ్వాస్, డా. చిరంజీత్ సైన్ పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ పరిశోధనను సమీక్షించిన ఎన్ఐటి మిజోరం ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రకటించింది.
 
మిజోరం గవర్నర్, వైస్ ఛాన్స్‌లర్ వి.కే. సింగ్, ఎన్ఐటి మిజోరం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. సుందర్ చేతుల మీదుగా విక్రమ్ గౌడ్ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు.

Read More మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..

“మా ప్రిన్సిపాల్‌కు డాక్టరేట్ రావడంతో కళాశాల గౌరవం పెరిగింది” : వాసవి విద్యాసంస్థల చైర్మన్ రమేష్ గౌడ్..

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట గ్రామానికి చెందిన ఒక సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విక్రమ్ గౌడ్ ఈ స్థాయికి చేరడం గ్రామానికి, కుటుంబానికి గర్వకారణమని వాసవి విద్యాసంస్థల చైర్మన్ రమేష్ గౌడ్ అన్నారు.

తమ కళాశాలలోనే విద్యను అభ్యసించి, అదే కళాశాలలో ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తూ ఉండటం గర్వకారణమని, ఇప్పుడు అతని ప్రతిభకు గుర్తింపుగా దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన ఎన్ఐటి మిజోరం నుండి డాక్టరేట్ రావడం వాసవి సంస్థలకు గొప్ప పేరు తెచ్చిందన్నారు.

“విక్రమ్ గౌడ్ సాధించిన ఈ విజయం మా విద్యాసంస్థ ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది” అని రమేష్ గౌడ్ ప్రశంసించారు. డాక్టరేట్ రావడంతో విక్రమ్ గౌడ్ బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు, పరిశోధనలు చేయడానికి ఇది ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు.

Views: 14

About The Author

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు