అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి..

On
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి

కాంగ్రెస్ లో మంత్రుల మధ్య సమన్వయం లేదు

కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 7:కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండని శనివారం కొత్తగూడెం మధువన్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో బిజెపి నేషనల్ కౌన్సిల్ మెంబర్, తమిళనాడు కర్ణాటక సహా ఇంచార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ  420హామీలు, 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, మంత్రుల మధ్య సమన్వయం లోపించింది అన్నారు. కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తగూడెం రూపు రేఖలు మారాలంటే బిజెపి రావాలన్నారు. సింగరేణిలో కుంభకోణంపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ జరిపి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రజలందరూ బీజేపి వైపు ఉన్నారని బిజెపి విజయం తథ్యం అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రంగా కిరణ్, విజయ్ బాబు, మనోహర్, నరేందర్, రవీందర్, గొడుగు శ్రీధర్ తదితరులు  పాల్గొన్నారు.

 

Views: 81
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత