కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం
రద్దయిన డైలీ, వీక్లీ టెండర్లు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్ డివిజన్ షాప్ లకు, సంబంధించి ప్రభుత్వం 14500 రూపాయలు కాగా 6000 కోరగా నిర్ణయం తరువాత తీసుకుంటాం అని కమిషనర్ తెలిపారు. కబేళ గతంలో 1లక్ష కాగా,ఇపుడు 1,11000 లకు పోయిది, వీక్లీ 25లక్షలా 3000లకు వేలం కాగా , డైలీ మార్కెట్ 25 లక్షల 85000 గవర్నమెంట్ వేలం కాగా , 40 లక్షలకు దక్కించుకున్నారు. కాగా వీక్లీ మార్కెట్ టెండర్లు జరుగుతున్న సమయంలో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు పాల్గొన్నారు. మిగతావారు టెండర్ మధ్య లోరాగా కమిషనర్ వారిని టెండర్లో పాల్గొననీయలేదు. దాంతో సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా టెండర్లు నిర్వహించారని టెండర్ దాకాలు చేసిన వారు, కొంతమంది కార్పొరేటర్లు టెండర్లు జరుగుతున్న కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలుపుతూ వాగ్వాదానికి దిగారు. దాంతో వీక్లీ టెండర్ తిరిగి నిర్వహిస్తామని, కమిషనర్ తెలపగా, డైలీ టెండర్ తీసుకున్న వారు వీక్లీ ఒకరే కావడంతో వీక్లీ టెండర్ రద్దు చేయటం పట్ల, టెండర్ నుంచి వైదొలుగుతాం అని తెలపగా,, టెండర్లు వాయిదా వేస్తున్నట్లుగా కమీషనర్ తెలిపారు.

Comment List