గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
12.5 లక్షల వ్యాయామంతో సిసి రోడ్ల నిర్మాణం
ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో పంచముఖ హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ..గ్రామంలో రూ. 12.5లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా,పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.వీధిలైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ శుభ్రత పనుల్లో వేగం పెంచడం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు,యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు.భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,యువ నాయకులు యుగేందర్ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మంగ్యతండా గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.


Comment List