రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
మేరా యువ భారత్ మరియు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఖమ్మం, రఘునాథపాలెం లోని బిసి గురుకుల డిగ్రీ కళాశాలలో వేదికగా జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో వినూత్నంగా ఆలోచించినట్లయితే ఎన్నో విజయాలను అందుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెంట్ ద్వారా ఎన్నో పరిశోధనలు విజయవంతం కానున్నాయి అటువంటి ఆవిష్కరణలు చేయాలంటే విద్యార్థులు డిగ్రీ స్థాయి నుండే ఇటువంటి సైన్స్ ఫెయిర్ లో పాల్గొనడం ద్వారా భవిష్యత్తులో విజయాలు సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్ట్స్ ను సందర్శించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోడిరెక్క ఉమా శంకర్, సయ్యద్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షారూక్, మరియు కళాశాల సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comment List