27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
On
విజయం తథ్యం అంటున్న మద్దెల సుధారాణి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)ఫిబ్రవరి 9: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 27 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నానని మద్దెల సుధారాణి తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ పిలుపుమేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఉన్నత చదువులు చదువుకున్న నాకు అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, 27వ డివిజన్ ప్రజలు నాకు ఒక అవకాశాన్ని కల్పిస్తే డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని, డ్రైనేజీ,రోడ్లు, మంచినీరు, వీధి లైట్లు ఇతర ఏ సమస్య అయినా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల పోటీలో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించిన ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయని, అవే నాకు విజయాన్ని చేకూరుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Views: 2
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Feb 2026 16:13:46
విజయం తథ్యం అంటున్న మద్దెల సుధారాణి

Comment List