టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 

On
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఇందు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం, మామిడి తోట కాలనీకి చెందిన అప్పం రితీష్(16) శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల సమీపించడంతో పాస్ అవుతానో లేదో అని మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి మౌనిక ఇచ్చిన పిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*స్థానికుల సమాచారం మేరకు *

గత కొద్దిరోజుల క్రితం తోటి విద్యార్థులతోని చిన్నచిన్న విభేదాలతో పాలకేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రితీష్ ను భజన మందిర్ దగ్గరలోని శ్రీ చైతన్య మరో బ్రాంచ్ కు మార్చడంతో గత కొద్ది రోజులుగా మనోవేదన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. కారణం ఏమైనాపటికి తండ్రి లేకుండా తల్లి మిషన్ కుట్టుకుంటూ కొడుకుని పెంచుకొని ప్రయోజకుడ్ని చేయాలనుకుంటే విధి వక్రీకరించి ఒక తల్లికి గుండె కోతను మిగిల్చి ఒంటరిదాని చేసింది.

Views: 152
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

టెన్త్ విద్యార్థి ఆత్మహత్య  టెన్త్ విద్యార్థి ఆత్మహత్య 
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి  10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో   టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో...
సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో యాంటి - డ్రగ్స్ ఆవేరేన్స్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..