రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

On
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

IMG-20260309-WA1095
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్‌లను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ బృందం ఉచ్చుపన్ని, లంచం తీసుకుంటున్న సమయంలో ఇద్దరు ఎస్ఐలను పట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 38

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News