శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

On
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

IMG20251026141149
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం, జరియా మండలం, దమ్మన్నగూడ గ్రామానికి చెందిన దివాకర్ బత్ర, అతని తమ్ముడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, శేరిగూడ, శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు నెలల నుంచి సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. దివాకర్ బత్ర సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతిచెందాడు. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఒడిశా కు తరలించడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహం 300 కిలోమీటర్ల వరకు వెళ్లిన మృతదేహాన్ని పోలీసులు తీసుకురావాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

Views: 5

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు