శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

On
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..

పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం..

గుట్టుచప్పుడు కాకుండా మృతదేహం తరలింపు...

IMG20251026141149
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాల నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం, జరియా మండలం, దమ్మన్నగూడ గ్రామానికి చెందిన దివాకర్ బత్ర, అతని తమ్ముడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, శేరిగూడ, శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో రెండు నెలల నుంచి సెంట్రింగ్ కార్మికులుగా పని చేస్తున్నారు. దివాకర్ బత్ర సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి మృతిచెందాడు. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఒడిశా కు తరలించడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతదేహం 300 కిలోమీటర్ల వరకు వెళ్లిన మృతదేహాన్ని పోలీసులు తీసుకురావాలని ఆదేశించడంతో చేసేదేమీ లేక మృతదేహాన్ని తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి