పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఏసీబీకి చిక్కిన టేక్మాల్ ఎస్సై రాజేష్

పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు

రిపోర్టర్ జైపాల్

న్యూస్ ఇండియా (టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ నవంబర్ 18) మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ. 30వేలు లంచం తీసుకుంటుండగా, ఎస్ఐ రాజేష్ ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ నుంచి బయటకి పారిపోయాడు. దీంతో ఎస్‌ఐ రాజేష్‌ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై రాజేష్ .. ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న మండల ప్రజలు స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చి సంబరాలు.

Views: 12

Related Posts

Post Comment

Comment List

Latest News

సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌  సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఫిబ్రవరి 21:దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్‌ అవగాహనా కార్యక్రమంలో భాగంగా పి.ఎస్.ఆర్...
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.
అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు