రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం

On
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం

కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో  రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిప్పనపల్లి పంచాయతీ లోని అహ్మద్ నగర్,వెంకటాపురం, తిప్పనపల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మంది రోగులను పరీక్షించి మందులను ఉచితంగా  అందజేశారు. శాస్త్ర చికిత్స అవసరమైన 15 మంది రోగులకు కంటి శాస్త్ర చికిత్స చేసేందుకు వెంటనే తమ వాహనంలో ఖమ్మం లోని మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తరలించారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స చేయనున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా 2000 రూపాయలు విలువచేసే ఉచిత ఫ్యామిలీ ప్రివిలైజ్ కూపన్లను ఉచితంగా గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ పీకే ఎం ఖాన్, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ట్రస్ట్ చైర్మన్ పాషా జునేడ్,ఐఎన్టియుసి సభ్యులు  కొమరయ్య, ఎస్కే గౌస్, సీతారామరాజు, మహేష్, రజాక్,వెంకటేశ్వర్లు పంచాయతీ సెక్రెటరీ సిహెచ్ శివ నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ధరావత్ రామారావు, మచ్చా కుమార్, జాకీర్ హుస్సేన్, యాకూబాలి, ఆకుల రాంబాబు, మల్లికార్జున్, హాస్పిటల్  సిబ్బంది దేవేందర్, పాషా పాల్గొన్నారు.

Views: 38
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు