తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
సర్పంచ్ ఎన్నికల బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు మూర్తి
On
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి(ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం రాంక్య తండా గ్రామపంచాయతీ లో సర్పంచ్ పదవికి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు మూర్తి బరిలో దిగారు. గతంలో గుగులోతు మూర్తి తండ్రి గుగులోతు గంగ్య సిపిఎం పార్టీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రజల కు వెనుదన్నుగా ఉన్నారు. అదే బాటలో తనయుడు నడుస్తామని ప్రజలు ఊహిస్తున్నారు.గుగులోతు మూర్తి మాట్లాడుతూ.. తన తండ్రి బాటలో తన నడుస్తానని ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.గతంలో తనకు అవకాశం లేకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపించానని అన్నారు. తమకు ఎన్ డి ఏ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రజలు కూడా తమను స్వాగతిస్తున్నారని కచ్చితంగా ఈ ఎన్నికలలో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.తాను ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు.

Views: 37
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Jan 2026 22:03:38
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...

Comment List