అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పర్యవేక్షణ ను మరింత బలోపేతం చేస్తాం” అని కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, నవంబర్ 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో నిన్న తెల్లవారుజామున జరిగిన దాడి స్థానికులకు కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఒక అపరిచిత వ్యక్తి స్థానిక యువకుడు శివ పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే శివను సన్రైజ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి హాస్పిటల్ ను సందర్శించి శివను పరామర్శించారు. ఈ సందర్భంగా నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పర్యవేక్షణ ను మరింత బలోపేతం చేస్తాం” అని తెలిపారు
. కాలనీ పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు.

Comment List