కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు

On
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు


•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం
•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం
•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు 
•సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టికి మంత్రి తుమ్మల ధన్యవాదాలు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి ప్రభుత్వ భూమి ఎకరం కేటాయిస్తూ క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పాత భవనం కావడం, అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో నూతన కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు చేయాలని మంత్రి తుమ్మలకు డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ 21 ఫిబ్రవరి 2024 న వినతి పత్రం అందజేశారు. దీంతో మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు  గౌరవ సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.  గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఖమ్మం నగరంలోని బురాన్ పురం లో గల ఎన్ఎస్పి స్థలం సర్వేనెంబర్ 93 లో ప్రభుత్వ భూమి కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. నూతన కార్యాలయం నిర్మాణానికి ఎన్.ఎస్పీ లో ఎకరం భూమి కేటాయింపు చేస్తూ  నిర్ణయం తీసుకుంది. నూతన జిల్లా పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వ భూమి కేటాయింపు పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు