పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం

వ్యాన్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు.. నలుగురు ఆస్పత్రికి తరలింపు

పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం

IMG-20260522-WA0022 మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. మండలంలోని గంట్లకుంట రోడ్ సమీపంలో ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఒక వ్యాన్ రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురు గాయపడ్డారు.

స్థానికుల వివరాల ప్రకారం పెద్దవంగరకు చెందిన కే. పరుశురాం తన భార్య వెంకటమ్మతో ఒక బైక్‌పై ప్రయాణిస్తుండగా, మరో బైక్‌పై సీహెచ్. సైదులు తన భార్య యాకలక్ష్మితో కలిసి సుతారీ పనుల కోసం తిరుమలగిరి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో తొర్రూర్ వైపు వెళ్తున్న వ్యాన్ వేగంగా వచ్చి రెండు బైక్‌లను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకటమ్మ మరియు సైదులకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటీ రఘు, పైలట్ నవీన్‌లు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Views: 79
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
​పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సబ్...
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు