టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
అధికలోడే ప్రమాదానికి ప్రధాన కారణం..
రంగారెడ్డి జిల్లా, యాచారం, మే 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామం వద్ద నాగార్జునసాగర్ హైవేపై శనివారం ఓ టిప్పర్ ఒరిగి రాత్రి సమయం కావడంతో పెను ప్రమాదం తప్పింది. చెరువు మట్టితో అధిక లోడుతో ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్న టిప్పర్ (టిఎస్07యుఈ5346) అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై ఒరిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న యాచారం పెట్రోలింగ్ మొబైల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో టిప్పర్ స్వల్పంగా దెబ్బతినగా, హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అధిక లోడుతో వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

Comment List