టేక్మాల్ మండలం మెదక్ జిల్లా బోడుమెట్పల్లి గ్రామ బిఆర్ఎస్ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ లోకి భారీ చేరికలు

టేక్మాల్ మండలం మెదక్ జిల్లా బోడుమెట్పల్లి గ్రామ బిఆర్ఎస్ నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ లోకి భారీ చేరికలు

న్యూస్ ఇండియా టేక్మాల్ ప్రతినిధి జైపాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని బొడ్మట్ పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నుండి ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు భారీగా చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షులు కంకర భూషణం మాట్లాడుతూ అధికార పార్టీలో అహం పెరిగిపోయిందని దాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అన్నారు. అధికార పార్టీలో కల్లబొల్లి మాటలతో మోసం చేసే నాయకులు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అంతేకాకుండా దామోదర రాజనర్సింహ నాయకత్వం నచ్చి పార్టీలు చేరానని అన్నారు. ఇందులో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పు శంకరప్ప యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జాడ మహేష్ రెడ్డి , బొడ్మట్ పల్లి దళిత నాయకులు కొటంగారి శంకరయ్య నూతనంగా చేరిన వారిలో బొడ్మట్ పల్లి బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కంకర భూషణం ,గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్ ,దళిత సంఘం ఉపాధ్యక్షులు డప్పు పెంటయ్య, మాజీ ఉపాధ్యక్షులు కృష్ణ, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు కాసాల నర్సింలు, కార్యకర్తలు కంకర బీరప్ప, కంకర మల్లేశం ,కంకర శివకుమార్ ,కుమార్ ,సంగమేష్ భవాని కుమార్ , భవాని లోకేష్ కంకర దేవరాజ్ కంకర శ్రీనివాస్ ,కుమ్మరి వీరేశం ,లతో పాటు సుమారు 40 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Views: 75

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే