అహంకార టిఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ ను పార్టీలను ఓడించండి

బిజెపి అభ్యర్థి కుంజ ధర్మ కి ఓటు వేసి భద్రాచలంని కాపాడండి

On

బిజెపి జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్

 

 

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) నంవబర్ 19: భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ - గవర్నమెంట్ హాస్పిటల్ - సాయిబాబా గుడి ఏరియా - తాత గుడి సెంటర్ - రామాలయం ఏరియాలలో జరిగిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ మాట్లాడుతూ భద్రాచలానికి బీఆర్ఎస్ పార్టీ 1100 కోట్లు బాకీ ఉందని, అవి చెల్లించాకే వారికి ఓటు అడిగే హక్కు వస్తుందని,వలసవాద అవినీతి రాజకీయాలతో భద్రాచలంను అభివృద్ధిలో వెనక్కి నెట్టేసిన కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు అడిగే హక్కే లేదని,భద్రాచలం అభివృద్ధి భద్రాచలం మీద ప్రేమ ఉన్న బిజెపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని అందుకే భద్రాచలం బిజెపి అసెంబ్లీ అభ్యర్థి కుంజా ధర్మన్నని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని భద్రాచలం ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ త్రినాధ రావు, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా నాయకులు చింతలచెరువు శ్రీనివాసరావు, మహిళా మోర్చా ఇన్చార్జ్ పండ్రంగి లక్ష్మి సుకన్య, కెవిపి సత్యనారాయణమ్మ, భద్రాచలం పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం