అహంకార టిఆర్ఎస్ అవినీతి కాంగ్రెస్ ను పార్టీలను ఓడించండి

బిజెపి అభ్యర్థి కుంజ ధర్మ కి ఓటు వేసి భద్రాచలంని కాపాడండి

On

బిజెపి జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్

 

 

 భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) నంవబర్ 19: భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ - గవర్నమెంట్ హాస్పిటల్ - సాయిబాబా గుడి ఏరియా - తాత గుడి సెంటర్ - రామాలయం ఏరియాలలో జరిగిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ మాట్లాడుతూ భద్రాచలానికి బీఆర్ఎస్ పార్టీ 1100 కోట్లు బాకీ ఉందని, అవి చెల్లించాకే వారికి ఓటు అడిగే హక్కు వస్తుందని,వలసవాద అవినీతి రాజకీయాలతో భద్రాచలంను అభివృద్ధిలో వెనక్కి నెట్టేసిన కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు అడిగే హక్కే లేదని,భద్రాచలం అభివృద్ధి భద్రాచలం మీద ప్రేమ ఉన్న బిజెపి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని అందుకే భద్రాచలం బిజెపి అసెంబ్లీ అభ్యర్థి కుంజా ధర్మన్నని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని భద్రాచలం ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ త్రినాధ రావు, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ గౌడ్, బిజెపి జిల్లా నాయకులు చింతలచెరువు శ్రీనివాసరావు, మహిళా మోర్చా ఇన్చార్జ్ పండ్రంగి లక్ష్మి సుకన్య, కెవిపి సత్యనారాయణమ్మ, భద్రాచలం పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే