కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

ఇద్దరి మధ్య వాగ్వాదం

By Venkat
On
కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన కొండా వర్సెస్ పల్లా

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో సిద్దిపేట హరిత హోటల్లో జరిగిన సమీక్ష సమావేశం నుంచి రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో.. మంత్రి ప్రోటోకాల్ ఉల్లంఘించిందని ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయాలకు, ఆచార కట్టుబాట్లకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజీ మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.

మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారుWhatsApp-Image-2023-12-30-at-18.29.58-696x361

Views: 30
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్