నా కూతుర్ని మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా ఆశీర్వదించండి

తొర్రూరు కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

నా కూతుర్ని మీ బిడ్డగా మీ అక్కగా మీ చెల్లిగా ఆశీర్వదించండి

*కడియం శ్రీహరి మాట్లాడుతూ*
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది,అభివృద్ధి చేయడానికి ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విన్నవించారు. గత ఐదేళ్ళు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రతిప-క్ష పాత్రకే పరిమితమయ్యామన్నారు. బీఆర్ఎస్ ను వీడి నేను నా కుతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరాము.కొంత మంది బిఅర్ఎస్ నాయకులకు వచ్చిన అవకాశాలను చెడగొట్టుకొని ఎదుటి వాళ్లపై విమర్శలు చేస్తున్నారనడం గమనార్హం. బిఆర్ఎస్ ప్రస్థానంలో ఒక్క తప్పు కూడా చేయలేదని, అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్, భూ కబ్జాలు చేయలేదు, ప్రయివేట్ యూనివర్సీటిలు పెట్టుకోలేదంటూ..నన్ను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు.ప్రతీ ఒక్కరూ శ్రీహరి ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నినదించారు. నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీలేదని ఆ హక్కు ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఉందన్నారు..ఎవరికి కూడా నన్ను విమర్శించే స్థాయి గాని, అర్హత గాని లేదన్నారు. నన్ను ఆశీర్వదించినట్లే నా కూతురును కూడా ఆశీర్వదించాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోరారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా... బిడ్డగా, అక్కగా, చెల్లీగా నిండు మనసుతో ఆశీర్వదించాలని యశస్విని ఝాన్సి రెడ్డిలను కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు అనుమాండ్ల తిరుపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కాకినాడ హరిప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు సుంచు సంతోష్ పట్టణ పార్టీ అధ్యక్షులు సోమరాజు శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదగాని సోమయ్య చాపల బాపురెడ్డి జలగం శ్రీనివాస్ గొంగడి శంకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1712570039446

Views: 113
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు