నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర

On
 నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు

ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర

 

👉తనను  గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే  ముదిరాజుల
అభివృద్ధి కి కృషి చేస్తానని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఖమ్మంలోని కోణార్క్ హోటల్ లో  కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత ఆధ్వర్యంలో   ముదిరాజులతో నిర్వహించిన   ఆత్మీయ సమ్మేళనం లో  నామ నాగేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడారు. తనకు ముదిరాజులతో బీసీ సోదరులతో మంచి అనుబంధం ఉందని చెప్పారు. తాను గెలిచిన తర్వాత వారి సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పారు. కేసీఆర్ బీసీ ల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, జిల్లాకు చెందిన బీసీ వద్దిరాజు రవిచంద్రను   రెండో సారి  రాజ్యసభకు పంపించిన ఘనత కేసీఆర్ ది అన్నారు.  ఇంకా ఈ సమావేశంలో 
  రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధు , ముదిరాజ్ సంఘం నాయకులు డాక్టర్ కిషోర్ బాబు, పిట్టల నాగేశ్వరరావు, ఇతర  ప్రముఖులు ,  కులం నుంచి   పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Views: 21
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అయోమయంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) కొత్తగూడెంలో నిన్న జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తు ఒప్పందంలో భాగంగా మేయర్...
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం :కూనంనేని 
సింగరేణి డాకర్ల నిర్లక్ష్యం ఖరీదు... యువకుడు నవీన్ ప్రాణం బలి..
విద్యార్థి భవిష్యత్తుతో ఆడుకుంటున్న అలేన్ ఇన్స్టిట్యూషన్...!
పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ కు అధిక ఓట్లు
కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి