ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

IMG-20240516-WA0078

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

 

 గురువారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో , ఎం.డేవిడ్ తో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Read More పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. 

 

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని అన్నారు. 

 

పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు.

 

 విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు.

 

జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు 4679 మంది విద్యార్థులకు గాను 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

 విద్యార్థులు, విధులు నిర్వహించే సిబ్బంది ఎవరికీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను, ఎలాక్ట్రానిక్ వస్తువులు తేవడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 

 

ఆర్టీసి బస్సులు సమయ పాలన పాటించాలని ,పోస్టల్ అధికారులు వారికి నిర్దేశించి నియమనిబంధనలు పాటించాలని అన్నారు.

 

 

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎస్. సత్యనారాయణ, డి.ఈ.ఓ రామారావు, ఆర్టీసి డి.ఎం. శివప్రసాద్,డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ అంబరీష్, పంచాయతీ, మునిసిపల్ శాఖ, పోస్టల్ శాఖ,విద్యుత్,పోలీసు శాఖ అధికారులు, కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భద్రకాళీ తదితరులు పాల్గొన్నారు.

Views: 53
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!