ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

IMG-20240516-WA0078

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

 

 గురువారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో , ఎం.డేవిడ్ తో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. 

 

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని అన్నారు. 

 

పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు.

 

 విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు.

 

జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు 4679 మంది విద్యార్థులకు గాను 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

 విద్యార్థులు, విధులు నిర్వహించే సిబ్బంది ఎవరికీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను, ఎలాక్ట్రానిక్ వస్తువులు తేవడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 

 

ఆర్టీసి బస్సులు సమయ పాలన పాటించాలని ,పోస్టల్ అధికారులు వారికి నిర్దేశించి నియమనిబంధనలు పాటించాలని అన్నారు.

 

 

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎస్. సత్యనారాయణ, డి.ఈ.ఓ రామారావు, ఆర్టీసి డి.ఎం. శివప్రసాద్,డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ అంబరీష్, పంచాయతీ, మునిసిపల్ శాఖ, పోస్టల్ శాఖ,విద్యుత్,పోలీసు శాఖ అధికారులు, కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భద్రకాళీ తదితరులు పాల్గొన్నారు.

Views: 53
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి