ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి::

IMG-20240516-WA0078

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. 

 

Read More భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!

 గురువారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో , ఎం.డేవిడ్ తో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై విద్యా, రెవిన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, పోస్టల్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Read More హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. 

Read More వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ

 

మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలనుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు మద్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతాయని అన్నారు. 

 

పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలన్నారు.

 

 విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు.

 

జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణకు 4679 మంది విద్యార్థులకు గాను 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 

 

 విద్యార్థులు, విధులు నిర్వహించే సిబ్బంది ఎవరికీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ లను, ఎలాక్ట్రానిక్ వస్తువులు తేవడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. 

 

ఆర్టీసి బస్సులు సమయ పాలన పాటించాలని ,పోస్టల్ అధికారులు వారికి నిర్దేశించి నియమనిబంధనలు పాటించాలని అన్నారు.

 

 

ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఎస్. సత్యనారాయణ, డి.ఈ.ఓ రామారావు, ఆర్టీసి డి.ఎం. శివప్రసాద్,డిప్యుటీ డి.ఎం.హెచ్.ఓ అంబరీష్, పంచాయతీ, మునిసిపల్ శాఖ, పోస్టల్ శాఖ,విద్యుత్,పోలీసు శాఖ అధికారులు, కలెక్టరేట్ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భద్రకాళీ తదితరులు పాల్గొన్నారు.

Views: 55
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!