తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు విద్యుత్ బిల్లు చెల్లించొద్దు
తెల్లరేషన్కార్డు కల్గి ఉన్నా జీరోబిల్లు రాకపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు
రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పత్రిక,మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగం చేసుకునే వినియోగదారుల గృహజ్యోతి పథకం కింద ధరఖాస్తు చేసుకున్నా లేదా తెల్లరేషన్కార్డు కల్గి ఉన్నా జీరోబిల్లు రాకపోయిన విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని విద్యుత్ అధికారులతో చర్చించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కొంతమంది అమాయక ప్రజలకు దగ్గర డబ్బులు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవిషయంలో వినియోగదారులు ఏలాంటి ఆందోళన చెందకూడదని మీడియా ద్వారా తెలియజేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List