బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జే వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ గోపి గురువారం బహుమతులు ప్రదానం చేశారు. ఖమ్మం జిల్లా నెహ్రూ యువ కేంద్ర వారి సహకారంతో కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ సత్తుపల్లి జె.వి.ఆర్ గ్రౌండ్ నందు వాలీబాల్, బ్యాడ్మింటన్ (షటిల్), 200 మీటర్ల పరుగు పందెం పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు, కళాశాల ప్రిన్సిపాల్ డా ఎన్ గోపి ఫిజికల్ డైరెక్టర్ డా సి హెచ్ పూర్ణచంద్రరావు పీర్ సాహేబ్ గారి చేతుల మీదుగా స్పోర్ట్స్ కిట్టు, మెడల్స్, మెమెంటోస్, సర్టిఫికెట్లు అందజేశారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List