టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 13: ఈనెల 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. ఇందు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం, మామిడి తోట కాలనీకి చెందిన అప్పం రితీష్(16) శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల సమీపించడంతో పాస్ అవుతానో లేదో అని మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి మౌనిక ఇచ్చిన పిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*స్థానికుల సమాచారం మేరకు *
గత కొద్దిరోజుల క్రితం తోటి విద్యార్థులతోని చిన్నచిన్న విభేదాలతో పాలకేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రితీష్ ను భజన మందిర్ దగ్గరలోని శ్రీ చైతన్య మరో బ్రాంచ్ కు మార్చడంతో గత కొద్ది రోజులుగా మనోవేదన చెందుతున్నట్లుగా తెలుస్తుంది. కారణం ఏమైనాపటికి తండ్రి లేకుండా తల్లి మిషన్ కుట్టుకుంటూ కొడుకుని పెంచుకొని ప్రయోజకుడ్ని చేయాలనుకుంటే విధి వక్రీకరించి ఒక తల్లికి కడుపు కోతను మిగిల్చి ఒంటరిదాని చేసింది.

Comment List